24, నవంబర్ 2019, ఆదివారం

నాటక ప్రదర్శన - విమర్శ 2

(కొనసాగింపు)

విమర్శ అనేది అర్థవంతంగాను, సహేతుకంగా ప్రయోజనవంతంగాను ుండాలి. అడ్డదిడ్డంగా మాట్లాడేసమయంలో తాను చెప్పిందే సరైనదని నొక్కి వక్కాణించటం కాదు. విమర్శించబడిన, విశ్లేషించబడిన ప్రదర్శన మున్ముందు ప్రజాదరణకు దూరమయ్యే అవకాశం వుందని ప్రొఫెసర్ గ్రెగరీ ఎం.కోనీయా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్ జి.యస్.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ... నాటక ప్రదర్శన విమర్శకు సంబంధించిన ప్రామాణికత విషయాల్లో ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో అన్న ప్రస్తావనకు వస్తే ముందుగా రచనను పరిశీలించి, విశ్లేషించాలి. అంటే ఆ రచనలోని కథాంశం, సన్నివేశాలు, పాత్ర చిత్రణ, సంభాషణలను, కథనాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించాలి. అంతేగాక ఆ రచన ప్రయోజనం ఏంటి అనే అంశాన్ని గమనంలోకి తీసుకోవాలి. తదుపరి అంశం అభినయం.. నటులు రచన ఉద్దేశ్యం, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభినయిస్తున్నారా? పాత్రల్లా ప్రవర్తిస్తున్నారా? ఆయా పాత్రల ప్రయోజనం సాధించటంలో సఫలీకృతులవుతున్నారా? పాత్రల మధ్య సమన్వయాన్ని సాధిస్తున్నారా? లేదా.. అనే అంశాలను పరిగణించాలి. తదుపరి అంశం.. దర్శకత్వం.. నాటక ప్రదర్శనకు సంబంధించిన అన్ని అంశాలను సమస్థాయిలో సమ తూకంలో ఉండేలా శ్రద్ధ వహించాడా లేదా..? పాత్రలతాలూకు స్వరూప, స్వభావాలను వెలికి తీయటంలో సఫలీకృతుడయ్యాడా లేదా..? రంగస్థల ప్రదర్శనకు సంబంధించిన అన్ని సాంకేతికాంశాలను సరియైన రీతిలో వినియోగించి ప్రదర్శన విజయానికి దోహదం చేశాడా లేదా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొంటూ, సాహితీ ప్రక్రియ అయిన రచనకు ప్రదర్శనా విలువల్ని సంతరించటంలో దోహదపడ్డాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఇక సాంకేతిక విలువలు ప్రదర్శన విజయవంతం కావటానికి ఏమేరకు దోహదపడ్డాయో లేదో అనే అంశాన్ని వివరంగా సమీక్షించాలి.

వీటన్నింటినీ విడివిడిగా పరిశీలించి, సమీక్షించుకుంటూ ఒక అంశానికి మరొకటి ఏవిధంగా దోహదపడిందీ, లేనిదీ పరిశీలిచబడాలి. ఇంతటి వివరాల ద్వారా సమీక్ష జరిపితే అది సద్విమర్శక దోహదపడుతుంది. అంతేకానీ, బావుందీ అని చెప్పటం లేదా బాగాలేదు అని అనటం విమర్శ కిందకు రాదు.. కేవలం అభిప్రాంగానే పరిగణింపబడుతుంది.

నిజానికి ఇటీవలి కాలంలో చాలామంది నాటక న్యాయనిర్ణేతలు ప్రైజులు ఇచ్చే క్రమంలో ఆయా సమాజాలవారు ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం నాకు నచ్చలేదు అందుకే ప్రైజు ఇవ్వలేదు.. అని.. అదేంమాటయ్యా అని అడిగితే.. మీరు నాటకం జనంకోసం ఆడుతున్నారా? ప్రైజులకోసం ఆడుతున్నారా..? అంటూ బోడి ప్రశ్న వేస్తారు. నిజానికి పోటీల్లో పాల్గొనే నాటికలు, లేదా నాటకాలు ప్రైజులకోసం కాక జనంకోసం ఆడతారా.? ప్రైజులు ఇవ్వటానికి కాకపోతే గాడిదలు కాయటానికి న్యాయనిర్ణేతలుగా కూర్చోబెడతారా? ప్రదర్శకులు పోటీ ప్రదర్శనల్లో పాల్గొంటారా..? అతి తెలివి తేటలు ఎక్కువైతేనే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి.. నిజానికి జనంకోసం నాటకం ఆడే వేదికలు వేరే వుంటాయి. పోటీ వేదికలపై పోటీలే జరుగుతాయి. అప్పుడే ప్రశ్నిస్తారు. ఈమాత్రం కూడా తెలియకుండా చచ్చుప్రశ్నలేస్తారు ఎందుకో...
(కొనసాగింపు)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు