25, ఏప్రిల్ 2020, శనివారం

సాంఘీక నాటక రంగానికి పుట్టినిల్లు పాలకొల్లు


కళలకు నిలయం కళాకారులకు ఆలయమైన పాలకొల్లు సాంఘీక నాటక రంగానికి పుట్టినిల్లు గా పేరుగాంచింది. పినిశెట్టి శ్రీరామమూర్తి, చలం‌, అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కొసనా ఈశ్వర్, కాశీనాధుని సత్యనారాయణ, మల్లది సత్యనారాయణ, దుర్వాసుల వెంకట శాస్త్రి, భమిడపాటి శ్రీ రామమూర్తి, భమిడపాటి లక్ష్మీ నారాయణ, ఆండ్ర శేషగిరిరావు, పోకల నరశింహారావు‌, ఉషా బాబూరావు, ఓఎస్.రావు, వంగానరశింహారావు, దాసరి సత్యనారాయణ మూర్తి, తొట్టెంపూడి ఆంజనేయులు, రావూరి నాగభూషణం, వంగా అప్పారావు, పేలూరి దాసు, కొంగరాపి అప్పారావు, బోనం బాబూరావు, చేగొండి సత్యనారాయణ మూర్తి, కత్తుల రామమోహన్, వీ‌రాఅప్పారావు, వీరా పోతన, గండేటి వెంకటేశ్వరరావు, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, గంటా రామమోహన్, మానాపురం సత్యనారాయణ, రాజా తాతయ్య, విన్నకోట వెంకటేశ్వరరావు, యియ్యిపు రామలిగశ్వరరావు తదితరులు నాటక రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందారు.



పాలకొల్లు కిచెందిన పినిశెట్టి శ్రీ రామమూర్తి రచించిన ఆడది, అన్నాచెల్లెలు, పల్లెపడుచు వంటి నాటకాలు ఎంతే పేరు ప్రఖ్యాతులు పొంది నేటికీ ఎక్కడో ఒక చోట ప్రదర్శింపబడుతున్నాయి. వీరా పోతన రచించిన తల్లీ క్షమించు నాటిక నంది నాటకోత్సవాలో పాల్గొని అనేక బహుమతులు పొందారు. తాళాబత్తుల వెంకటేశ్వరరావు సైకతశిల్పం, సప్తపది, దిష్టబొమ్మలు వంటి నాటికలు రచించి నాటకరంగలో మంచి రచయితగా పేరుపొందారు. విన్నకోట వెంకటేశ్వరరావు, రాజా  తాతయ్య, మానాపురం సత్యనారాయణ, వంగా నరశింహారావు నంది నాటకోత్సవాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

పాలకొల్లుకి చెందిన మాంటిస్సోరి స్కూల్, దీప్తి స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బాలల నాటికలు నంది నాటకోత్సవాలలో పాల్గొని అనేక బహుమతులు పొందారు.

పాలకొల్లు నాటక పరిషత్తులు
చలనచిత్రరంగంలో పాలకొల్లు కళాకారులు ప్రధాన పాత్ర పోషించడానికి ఇక్కడి నాటక పరిషత్ లు కీలకపాత్ర వహిచాయి.దాదాపు అరవై సంవత్సరాల క్రితం నాటక రంగాన్ని ఆంద్ర నాటక కళాపరిషత్ ఆదుకున్న సమయంలో పాలకొల్లు లో కొందరు యువకులు మిత్ర బృందం అనే సంస్థ ను ఏర్పాటు చేసి దసరా ఉత్సవాల సందర్భంగా నాటక పోటీలు నిర్వహించారు. పాలకొల్లు లో నాటక పరిషత్ లు ప్రారంభించడానికి తొలిమెట్టు బొండాడ పెంటయ్య, బొండాడ వెంకట్రాజు గుప్త, వంకాయల పురుషోత్తం, జస్టీస్ ఇయ్యపు పాండురంగారావు, పినిశెట్టి సత్యనారాయణ, కూరెళ్ళ సత్యనారాయణ, అద్దేపల్లి రాంప్రసాద్, చుండూరి రెడ్డిబాబు, గమిని మాణిక్యాలరావు, శ్రీ కాకొల్లు రామబ్రహ్మం, వేము రామలిగయ్య వంటి కళిభిమానులు దాదాపు 14సంవత్సరాలు నాటక పరిషత్ నిర్వహించారు. ఈ పరిషత్ లో ఆదుర్తి సుబ్బారావు, సావిత్రి వంటి ప్రముఖులను సన్మానించారు. పాలకొల్లు నాటక పరిషత్ పేరిట జాన నాగేశ్వరరావు, బోళ్ళ సర్వేశ్వరరావు‌, ఉషాబాబూరావు, వీరా అప్పారావు, కొంగరాపి అప్పారావు, వీరా సత్యం, గుత్తికొండ కాశీ నాయకత్వం వహించారు.

1964లో కొంతమంది యువకులు నెహ్రూ ప్రెండ్స్ యూనియన్ స్దాపింఛి నాటిక పోటీలు రెండు సంవత్సరాలు చేసారు. ఈ సంస్థకు కందుల అప్పారావు, వంగా నరశింహారావు, బందెల ఈశ్వరరావు, కొంగరాపి అప్పారావు కర్రా సత్యనారాయణ, పిహెచ్.గోపాలరాజు సారద్యం వహించారు. ఈ కాలంలోనే సోమేశ్వర అగ్రహారం లో ఆంజనేయ కళాపరిషత్, వీవర్స్ కాలనీ యువజన సంఘం ఆద్వర్యంలో నాటికల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాజాను బద్రం‌, ఓఎస్.రావు, విన్నకోట వెంకటేశ్వరరావు, కొడవటీ దత్తు, మానెం దుర్గాప్రసాద్ సారద్యం వహించారు.

చేగొండి వెంకట హరరామ జోగయ్య ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో పాలకొల్లు లోని పరిషత్ లు అన్నీకలిపి సంగీత నాటక అకాడమీ గా రూపకల్పనచేసి నాటక పోటీలు నిర్వహించారు. దీనికి జోగయ్య, ఆద్దేపల్లి రాంప్రసాద్, అత్యం జగన్మోహన్, చుండూరి రెడ్డి బాబు,వంగా నరశింహారావు నాయకత్వం వహించారు. స్వర్గీయ కోడి రామకృష్ణ స్వర్గీయ దాసరి నారాయణ రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కాలంలో మిత్రులు సహకారంతో దాసరి నారాయణ రావు కల్చరల్ అసోసియేషన్ స్థాపించి 5 సంవత్సరాలు నాటికల పోటీలు నిర్వహించారు. దీనికి ఇయ్యిపు పాండురంగారావు, కొటికలపూడి రాజమోహన్ రావు,  ఇయ్యిపు రామచంద్రరావు, ఇయ్యిపు రామలిగేశ్వరరావు, శివాల ప్రభాకర్ సారధ్యం వహించారు.

ప్రముఖ జర్నలిస్ట్ అడబాల వీరాస్వామి రాజా 1960లో మహాత్మా మైత్రిబృందం అనే నాటక సంస్థను స్థాపించడం ద్వారా పాలకొల్లు నాటక పరిషత్ ల చరిత్ర మలుపు తిరిగింది. ఈ నాటక పరిషత్తు పోటీల సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, గుర్రం జాషువా, బోయి భీమన్న, నటరాజ రామకృష్ణ, సంపత్ కుమార్, చెరుకువాడ నరసింహం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య, బాట్టం శ్రీ రామమూర్తి, అద్దేపల్లి వివేకానంద దేవి, క్రొవ్విడి లింగరాజు వంటి ఉద్దండులు పాల్గొన్నారు. మహాత్మా మైత్రి బృందానికి మాజీమంత్రి చేగొండి వెంకట హరరామ జోగయ్య, చల్లా రాజా, అందే పిచ్చయ్య, ఇయ్యిపు వీరబద్రం, చీకట్ల నరసింహమూర్తి, పోలిశెట్టి బేబి, కొంగరాపి అప్పారావు, మండెల వెంకట నర్సయ్య సారద్యం వహించారు.

వర్ధనీడి సత్యనారాయణ ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో వర్దినీడి బాబ్జీ, చుండూరి రెడ్డి బాబు,చందక రాము ఆధ్వర్యంలో క్షీరపురి నాటక అకాడమీ పేరుతో నాటికల పోటీలు నిర్వహించారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం సహకారంతో దాసరి నారాయణరావు కల్చరల్ యూనిట్ పేరుతో రెండు సంవత్సరాలు నాటక ల పోటీలు సురభి నాటకోత్సవాలు నిర్వహించారు.

ఈ నాటక పోటీలకు డాక్టర్ సీహెచ్. సత్యనారాయణ మూర్తి, వీరా శ్రీనివాస్, వంగా నరశింహారావు, కత్తుల రామమోహన్, పోలిశెట్టి శ్రీనివాస్, రావూరి చాచా, గండేటి వెంకటేశ్వరరావు, వీరా పోతన సారద్యం వహింఛారు.

శ్రీ రామపేట దేవి ఫ్రెండ్స్ యూనియన్ పేరిట రాజా తాతయ్య,శివాల రామారావు, చీర దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నాటక పరిషత్ నిర్వహించారు.

పాలకొల్లు లలిత కళాంజలి నాటక అకాడమీ కి జస్టీస్ ఇయ్యిపు పాండురంగారావు, వాకాడ అప్పారావు, కొటికలపూడి రాజమోహనరావు, ఇయ్యిపు రామలింగేశ్వర రావు, ఇందుకూరి దిలీప్ కుమార్ రాజు, కొటికలపూడి కృష్ణా రావు, మానాపురం సత్యనారాయణ, శివాల దుర్గా ప్రసాద్, నీలంశెట్టీ సత్యప్రసాద్, మేడికొండ శ్రీనివాసరావు సారద్యం వహించారు.

2008లో మానాపురం సత్యనారాయణ వ్యవస్థాపకునిగా పాలకొల్లు కళాపరిషత్ ఆవిర్భావం జరిగింది. చలం స్మారక నాటకోత్సవం, అల్లు రామలింగయ్య, పినిశెట్టి శ్రీ రామమూర్తి, ఇవివి సత్యనారాయణ, వంగా అప్పారావు స్మారక నాటకోత్సవాలు, డాక్టర్ గజల్ శ్రీ నివాస్ పాలకొల్లు కళాపరిషత్, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ స్మారక నాటకోత్సవం 12సంవత్సరాలుగా నాటికల పోటీలు నిర్వహిస్తున్నారు. కె.వి.కృష్ణ వర్మ‌‌, మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీ నివాసరావు, విన్నకోట వెంకటేశ్వరరావు, డాక్టర్ వర్మ, జక్కంపూడి కుమార్, కొణిజేటి గుప్త, విఠాకుల రమణారావు సారధ్యం వహిస్తున్నారు. పాలకొల్లులో సుదీర్ఘ కలం నాటక పరిషత్ నిర్వహించిన సంస్థ లలిత కళాంజలి నాటక అకాడమీ 33 సంవత్సరాలు నిర్వహించారు.

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ద్వారా సినీ దర్శకునిగా పరిచయ మైన కోడి రామకృష్ణ మిత్రుల సహకారంతో 33సంవత్సరాల పాటు నాటికల పోటీలు నిర్వహించారు. 1983లో ఈ పరిషత్ ప్రారంబించి తొలుత నాటకాలు, తర్వాత నాటకాలు, నాటికల పోటీలు నిర్వహించి అతి పెధ్ద పరిషత్ గా పేరు పొందింది. ఆయన బతికి ఉంటే మరల పరిషత్ జరిపేవారు.
(పాలకొలను వార్తా పత్రిక, 10వ వార్షికోత్సవ సంచిక, 16 నవంబరు 2013, పుట. 15,16. )
(వ్యాస రచయిత: మానాపురం సత్యనారాయణ, జర్నలిస్ట్, పాలకొల్లు కళా పరిషత్ వ్యవస్థాపకుడు)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు