27, ఏప్రిల్ 2020, సోమవారం

ఆంధ్ర నాటక కళా పరిషత్తులో నెల్లూరు జిల్లా, వెంకటగిరి పట్టణ పాత్ర

1944,45 సంవత్సరాలలో వెంకటగిరిలోని అమెచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి ఏలూరు వాస్తవ్యులు శ్రీ కొండముది గోపాలరాయ శర్మ వారు రచించిన ఎదురీత అనే నాటకాన్ని టి. ఈశ్వర దాస్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర నాటక కళా పరిషత్ విజయవాడ దుర్గా కళామందిరంలో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ సంగీతం బహుమతులు సాధించారు. ఇందులో బాలసరస్వతి గారు నటించారు. దీనికి ఆత్రేయ గారు 5 పాటలు రాశారు.

ఆ తర్వాత, ఆత్రేయ గారు రచించిన రామ్ రహీం, నాటకం 1949,50 సంవత్సరాలలో ప్రదర్శించి ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన బహుమతి సాధించారు. ఆ నాటకంలో శ్రీ మోహన్ దాస్ గారికి ఉత్తమ సంగీతం బహుమతి వచ్చింది. ఆ తరువాత వరుసగా ఆత్రేయ గారి కప్పలు, ఎన్జీవో నాటికలు ఆంధ్ర నాటక పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన బహుమతులు సాధించాయి. ఆ తర్వాత వెంకటగిరిలోని కల్చర్ ఆర్ట్స్ థియేటర్ వారు శ్రీ వేణు గారి రచన, దర్శకత్వంలో దిష్టి బొమ్మలు అనే నాటకాన్ని ఆంధ్ర నాటక కళా పరిషత్ లో ప్రదర్శించగా శ్రీ వేణు గారికి ఉత్తమ నటుడు బహుమతి వచ్చింది.

కాలగమనంలో అన్ని సంస్థలు ఒకే తాటి మీదికి వచ్చి నట సమాఖ్య పేరుతో బహుశ 1963 నుండి 2004 వరకు దిగ్విజయంగా, ప్రతిష్టాత్మకంగా పరిషత్తు నిర్వహించడంతోపాటు శ్రీ జిఎం శాస్త్రిగారు రచించిన ఈ జనానికోదండం నాటకం పరిషత్తులలో ప్రదర్శించారు.

కె.వి.రమణారెడ్డిగారు, వేణు గారు జంటగారాసిన ‘రాజీవం’ నాటికను తొలిసారిగా ఈ సమాజంవారే ప్రదర్శించగా, తర్వాత
జి.యస్.ఆర్. ముార్తిగారు పాపులర్ చేశారు.
(ఈ సమాచారం వెంకటగిరి వాస్తవ్యులు, సీనియర్ నటులు గురుతుల్యులు శ్రీ ఎస్ ఎల్ నరసింహం గారి నుండి జిబికె మూర్తిగారు సేకరించారని తెలిసింది.)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు